అబుధాబి ముష్రిఫ్ ప్యాలెస్లో పాలకుల ఈద్ వేడుకలు
- May 02, 2022
యూఏఈ: ఎమిరేట్స్ పాలకులు, సుప్రీం కౌన్సిల్ సభ్యులు, క్రౌన్ ప్రిన్స్లు, డిప్యూటీ రూలర్లు ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షల్ని ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి అందించడం జరిగింది. మిష్రెఫ్ ప్యాలెస్లో జరిగిన ఈద్ వేడుకల సందర్భంగా పాలకులు ఒక్క చోట హాజరయ్యారు. షేక్ ఖలీఫా మంచి ఆరోగ్యంతో వుండాలనీ, దేశం అభివృద్ధి పథంలో పయనించాలని రూలర్స్ ఆకాంక్షించారు. వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్,అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ రాయల్స్, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







