పదోతరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు
- May 04, 2022
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38926 ఖాళీలలను భర్తీ చేయనున్నారు భర్తీ చేయనున్న పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలను పరిశీలిస్తే తెలంగాణలో 1226 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్లో 1716 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలకు సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM),డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు. ఏబీపీఎం,డాక్సేవక్ పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ.10000 వేతనంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మెరిట్ లిస్ట్ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్ పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 2,2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 5,2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://indiapostgdsonline.gov.inపరిశీలించగరలు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







