రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరణ
- May 04, 2022
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. మరోసారి హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనకు వర్సిటీ వీసీ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే కాగా.. రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఎన్ఎస్యూఐ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్ల దరఖాస్తుపై నిర్ణయాన్ని ఓయూ వీసీకే వదిలేయడం జరిగిపోయాయి.. ఇదే సమయంలో ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఓయూ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరారు పిటిషనర్స్.. అయితే, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిర్ణయానికి వదిలేసింది హైకోర్టు సింగ్ బెంచ్.. ఇక, హైకోర్టు సింగిల్ బెంచ్ అదేశం ప్రకారం మళ్లీ దరఖాస్తు చేసుకోన్న అనుమతి నిరాకరణ.. అయితే, పెట్టుకున్న దరఖాస్తును వీసీ పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. కాగా, రాహుల్ గాంధీ ఈ నెల 6, 7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనుండగా.. 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సందర్శనకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







