వడ్డీ రేటును పెంచిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్

- May 06, 2022 , by Maagulf
వడ్డీ రేటును పెంచిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్

యూఏఈ: యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటును పెంచింది. 50 బేసిస్ పాయింట్లను పెంచడంతో వడ్డీ రేటు 2.25 శాతానికి చేరుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. యూఏఈలోని పన్నెండు ప్రధాన కేంద్ర బ్యాంకులు చివరిగా 2021లో వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈ సంవత్సరం అదే పద్ధతిని అనుసరించాయి. వడ్డీ రేటు పెంపు కారణంగా ఇల్లు, వాహనం, ఇతర వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై నెలవారీ వాయిదాలు పెరగనున్నాయి. తాజా పెంపుతో వినియోగదారులు అధిక EMIలు చెల్లించవలసి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com