మావోయిస్టు దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గింది: ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్
- May 06, 2022
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్ట్ల దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు.జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని.. ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు.రాష్ట్రంలో మావోయిస్ట్ దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. జన జీవన స్రవంతిలోకి వచ్చే వారికి పరిహారం అందిస్తామన్నారు. జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని భాస్కర్, మోహన్, వంతల కృష్ణా, కిల్లో రాజు, మరొక మావోయిస్టు లొంగిపోయారని వెల్లడించారు.
గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్శాఖ అండగా ఉంటుందని.. మావోయిస్టులపై ఉన్న రివార్డ్ను వారికే అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురిపై లక్ష రూపాయల రివార్డ్ ఉందన్నారు.గాలికొండ ,పేద బయలు, కోరుకొండ ఏరియాలో ఇంకా మావోయిస్టు కమిటీలు ఉన్నాయని.. గతంలో కంటే ప్రస్తుతం వారి ప్రభావం తగ్గిందన్నారు. ఏజెన్సీలో కూంబింగ్ నిరంతరం కొనసాగుతుందని..వీరిపై నిఘా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందటంతో మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపి తెలిపారు.
తాజా వార్తలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!









