ఐపీఎల్ 2022: హైదరాబాద్ ముందు బిగ్ టార్గెట్
- May 08, 2022
ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. టాస్ నెగ్గిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.హైదరాబాద్ ముందు 193 పరుగులు భారీ లక్ష్యం నిర్దేశించింది.
హైదరాబాద్తో మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ (73*) దంచికొట్టాడు. డుప్లెసిస్ 50 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 8 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. డుప్లెసిస్ తో పాటు రజత్ పటిదార్ (48), గ్లెన్ మ్యాక్స్వెల్ (33), దినేశ్ కార్తిక్ (30*) ధాటిగా ఆడారు. ఫలితంగా బెంగళూరు భారీ స్కోర్ చేసింది. కాగా, విరాట్ కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరించాడు. గోల్డెన్ డకౌట్ అయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో జగదీశ్ సుచిత్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తిక్ త్యాగి ఒక వికెట్ తీశాడు.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









