హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మైగ్రంట్స్ హెల్ప్ డెస్క్
- May 11, 2022
హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు...ముఖ్యంగా గల్ఫ్,మలేసియా లాంటి 18 ఈసీఆర్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాసి సహాయతా కేంద్రం (మైగ్రంట్స్ హెల్ప్ డెస్క్) ను ఈ రోజు ఉదయం ప్రారంభించారు.
ఎయిర్పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) లు సంయుక్తంగా ఈ హెల్ప్డెస్క్ని ఏర్పాటు చేశాయి.
తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రాణి కుముదిని ఈ హెల్ప్ డెస్క్ను ప్రారంభించారు. టాంకాం అధికారి నాగభారతి, ఎన్నారై అధికారి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
అమెరికా వెళుతున్న విద్యార్థి బేతి యశ్వంత్ రెడ్డితో కలిసి వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సాయంత్రం విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్ వద్ద ఉన్న ఈ హెల్ప్ డెస్క్ ను సందర్శించారు.టాంకాం అధికారి నాగభారతి, హెల్ప్ డెస్క్ ఇంచార్జి ఫణి కుమార్ లను ఈ సందర్బంగా అభినందించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







