ఉత్తర కొరియాలో లాక్‌డౌన్

- May 12, 2022 , by Maagulf
ఉత్తర కొరియాలో లాక్‌డౌన్

సియోల్: ఉత్తర కొరియాలో మొదటిసారిగా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. కరోనా వెలుగుచూసిన రెండేళ్ల తర్వాత అక్కడ తొలి కేసు నమోదు కావడం గమనార్హం. అయితే, ఒక్క కేసు వెలుగు చూడగానే అప్రమత్తమైన ఉత్తర కొరియా వెంటనే సరిహద్దులు మూసేసి లాక్‌డౌన్ విధించారు. దేశాధినేత కిమ్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కరోనా కట్టడి చేసే చర్యలు చేపట్టారు.

రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతున్న వారికి ఆదివారం కరోనా పరీక్షల్లో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కిమ్ అధికార కొరియన్ వర్కర్స్ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు పై చర్చించారు. వైరస్‌ను అదుపు చేసే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. తక్కువ వ్యవధిలోనే కరోనా మూలాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com