దుబాయ్ లో శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం..
- May 12, 2022
దుబాయ్: దుబాయ్ కు వచ్చిన శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణించారు.కుటుంబంతో కలిసి దుబాయ్ వచ్చిన ఎమ్మెల్యే రమేశ్ లట్కే బుధవారం గుండెపోటుతో మరణించారని శివసేన ఆఫీస్ బేరర్ తెలిపారు.ముంబైలోని అంధేరి ఈస్ట్ నియోజకవర్గం నుంచి రమేశ్ లట్కే రెండుసార్లు శివసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
2014లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్టిని ఓడించి..తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు లట్కే. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం.పటేల్ పై ఘనవిజయం సాధించారు. అంతకుముందు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్కు(BMC) కార్పొరేటర్గా కూడా పనిచేశారు.ఎమ్మెల్యే మృతి వార్త తెలిసి పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.రమేశ్ లట్కే మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని,ఇటీవల కొంకణలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా విమానంలో కలిశారని బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే అన్నారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







