తొలిసారిగా సౌదీ అరేబియాలో హిందూ సాధువులకు స్వాగతం

- May 12, 2022 , by Maagulf
తొలిసారిగా సౌదీ అరేబియాలో హిందూ సాధువులకు స్వాగతం

రియాద్: రియాద్‌లో మే 11న గురుహరి మహంత్ స్వామి మహరాజ్, పూజ్య బ్రహ్మవిహారిదాస్ స్వామి మహరాజ్ ఆశీస్సులతో చారిత్రక ఇంటర్‌ఫెయిత్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.ముస్లిమ్ వరల్డ్ లీగ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 90 మంది ప్రముఖ మతపరమైన నాయకులు 35 దేశాల నుంచి పాల్గొన్నారు. వివిధ మతాలకు చెందినవారికి సంబంధించి సహజమైన, సాధారణమైన విలువల గురించి ఈ ఫోరంలో చర్చ జరిగింది.హిందూ సాధువు ప్రసంగాన్ని ఎండబ్ల్యుఎల్ సెక్రెటరీ జనరల్ షేక్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ఇస్సా ప్రశంసించారు. ప్రపంచ నాయకులు కూడా ఈ ప్రసంగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భూమిపై శాంతియుత వాతావరణం కోసం అన్ని మతాలకు చెందిన పెద్దలూ కలిసి పని చేయాలని వక్తలు ఆకాంక్షించారు. బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ, సౌదీ అరేబియాలో తొలిసారిగా సాధు పుంగవులకు స్వాగతం పలకడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com