చెన్నై ఇక ఇంటికే..
- May 13, 2022
ఐపీఎల్ 2022 సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై ఘోర పరాజయం పాలైంది. ముంబైతో పోరులో ఓటమి చవిచూసిన చెన్నై.. ఫ్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. దాంతో పాటే ముంబై మాదిరే ఇంటిదారి పట్టింది.
ముంబై బౌలర్ల ధాటికి తొలుత ధోనీ సేన 97 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 14.5 ఓవర్లలో 103 పరుగులు చేసి విజయం సాధించింది.
ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (34*) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (18), హృతిక్ షోకీన్ (18), టిమ్ డేవిడ్ (16*) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో ముంబై ఆరంభంలో తడబడినా.. చివరకు లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి మూడు వికెట్లు పడగొట్టాడు. మొయిన్ అలీ, సిమర్జిత్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో ముంబైకి పెద్దగా ప్రయోజనం లేకపోయినా.. ఓడిపోయిన చెన్నై కూడా ఇంటిముఖం పట్టక తప్పదు.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







