ఎడిసికి వీడ్కోలు పలికిన ఏపీ గవర్నర్
- May 13, 2022
విజయవాడ: రాజ్భవన్లోని దర్బార్ హాల్లో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తన మిలటరీ ఏడీసీ మేజర్ సాహిల్ మహాజన్కు వీడ్కోలు పలికారు. ఆగస్టు 2019లో ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో గవర్నర్కు ఏడీసీగా బాధ్యతలు స్వీకరించిన సాహిల్ మహాజన్, పదవీకాలం పూర్తయిన నేపధ్యంలో శనివారం విధుల నుంచి రిలీవ్ కానున్నారు. కార్యక్రమంలో భాగంగా సాహిల్ మహాజన్ను గవర్నర్ హరిచందన్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ సాహిల్ గవర్నర్ భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలోనూ శ్రద్ధ వహించడమే కాకుండా, విధి నిర్వహణలో సంతృప్తికరమైన సేవలు అందించారన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా, గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి బి.సి. బెహరా, ఎడిసి (పోలీస్) ఈశ్వరరావు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సన్యాసిరావు, లైజన్ అధికారి టివి నరసింహన్ తదితరులు సాహిల్ పనితీరును అభినందించారు. భవిష్యత్తులో మంచి విజయాలను నమోదు చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







