దోహా లో భారత మంత్రి ని కలిసిన ప్రవాస భారతీయులు

- May 13, 2022 , by Maagulf
దోహా లో భారత మంత్రి ని కలిసిన ప్రవాస భారతీయులు

దోహా: విదేశీ పర్యటనలో భాగంగా కతర్ కి విచ్చేసిన భారత కేంద్ర విదేశాంగ మరియు పార్లమెంటరీ శాఖ  సహాయ మంత్రి మురళీధరన్ సాంస్కృతిక, సామాజిక, వ్యాపార,క్రీడా సంఘాల నాయకులతో విడి విడి గా సమావేశం నిర్వహించారు.సామాజిక సేవ విభాగంలో భాగంగా తెలంగాణ గల్ఫ్ సమితి కి ఎంబసీ నుంచి ఆహ్వానం మేరకు అధ్యక్షుడు సుందరగిరి శంకర్ హాజరై కతర్ లో మన భారతీయులకు సంబంధించిన వివిధ సమస్యల పై కేంద్ర మంత్రికి తెలియజేయడం జరిగింది.అందరి సమస్యలను తెలుసుకున్న మంత్రి వీటి పై కతర్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం తరపున మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com