యూఏఈ అధ్యక్షుడి మృతికి ప్రధాని మోదీ సంతాపం

- May 14, 2022 , by Maagulf
యూఏఈ అధ్యక్షుడి మృతికి ప్రధాని మోదీ సంతాపం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఆకస్మిక మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. "హెచ్‌హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ మరణించిన విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను" అని ప్రధాన మంత్రి తన ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొన్నారు. దివంగత యూఏఈ ప్రెసిడెంట్ "గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు, అతని ఆధ్వర్యంలో భారతదేశం-యూఏఈ సంబంధాలు అభివృద్ధి చెందాయి" అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో భారతీయ సమాజం యూఏఈ ప్రజలతో ఉన్నారని పేర్కొంటూ ప్రధాని మోదీ తన సంతాపాన్ని పంపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని మోదీ ప్రార్థించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్ కూడా యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణంపై తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 73 సంవత్సరాల వయస్సులో మరణించారు. షేక్ అల్ నహ్యాన్ నవంబర్ 2004 నుండి యూఏఈ  అధ్యక్షుడిగా, అబుదాబి పాలకుడిగా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com