కాఫీ తాగితే రిలాక్స్ అయిపోతానంటోన్న ‘మెంటల్’ భామ.!
- May 17, 2022
‘వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ఓ సినిమాలో హీరోయిన్ చెప్పే డైలాగ్ వుంటుంది. ఎంత కోపంలో వున్నా సరే, హీరో ఈ మాటలకు కూల్ అయిపోతుంటాడు. ఆ మాటకొస్తే, ఎవరైనా సరే, కాఫీ ఇస్తే కూల్ అయిపోతుంటారనుకోండి. ఎన్ని టెన్షన్స్ వున్నా, హాయిగా కూర్చొని ఓ కప్పు కాఫీ లాగిస్తే చాలు ఆ టెన్షన్స్ నుంచి రిలాక్స్ మూడ్లోకి వచ్చేశామన్న ఫీల్ వుంటుంది. కాఫీలో వున్న మ్యాజిక్ అది.
ఇప్పుడీ కాఫీ ముచ్చట ఎందుకంటారా.? మన హీరోయిన్ కూడా అంతే, ఎన్ని టెన్షన్స్ వున్నా సరే, కప్పు కాఫీ తాగితే చాలు రిలాక్స్ మూడ్లోకి వచ్చేస్తుందట. ఇంతకీ ఎవరా హీరోయిన్.? ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్.
హీరోయిన్గా స్టార్ స్టేటస్ అందుకోలేదు కానీ, నివేదా పేతురాజ్లో సమ్థింగ్ డిఫరెంట్ మ్యాజిక్ వుంది. నటిగా ఎలాంటి రోల్ అయినా క్యారీ చేయగల టాలెంట్ వుంది ఈ భామలో. స్టార్ స్టేటస్తో తనకు పని లేదంటోంది అందుకే నివేదా పేతురాజ్. నటిగా మంచి పాత్రలు దక్కించుకోవడమే తన మోటో అని చెబుతోంది.
రీసెంట్గా నివేదా పేతురాజ్ నటించిన ‘బ్లడీ మేరీ’ ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ దక్కించుకుంది. చిన్న సినిమానే అయినా పెద్ద ప్రశంసలు దక్కించుకుంది. నివేదా పేతురాజ్ నటనే ఈ సినిమాకి మెయిన్ అస్సెట్. త్వరలో ‘విరాట పర్వం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది నివేదా పేతురాజ్.
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా రూపొందుతోన్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ ఓ స్టన్నింగ్ రోల్ పోషిస్తోంది. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకుడు.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







