వినియోగదారులకు ఇ-చెల్లింపులు తప్పనిసరి: ఒమన్
- May 18, 2022
మస్కట్: వినియోగదారులకు ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలను తప్పనిసరిగా అందించాని వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) వెల్లడించింది. ఈ మేరకు వినియోగదారులకు ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలను అందించడంపై మంత్రిత్వ శాఖ 386/2022 ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం.. నిర్దేశిత రంగాల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవను అందించడానికి కట్టుబడి ఉండని వాణిజ్య సంస్థలు, కంపెనీలకు జరిమానా విధించబడుతుందని ప్రకటించింది. ఆర్టికల్ (1) ప్రకారం.. ఆహార పదార్థాలు, బంగారం, వెండి, రెస్టారెంట్లు, కేఫ్లు, కూరగాయలు, పండ్లు, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ వస్తువులు, పొగాకు ఉత్పత్తులను విక్రయించడం, అలాగే పారిశ్రామిక జోన్లు, కాంప్లెక్స్ లలో అన్ని కార్యకలాపాలను నిర్వహించే సంస్థలు, మాల్స్, గిఫ్ట్ మార్కెట్లు వినియోగదారులందరికీ ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవను అందించడం తప్పనిసరి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO), ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI), కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) లను వినియోగదారులు ఎలక్ట్రానిక్గా లేదా నగదు ద్వారా చెల్లించడాన్ని ఎంచుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రి మండలి నిర్ణయం.. 386/2022 రాయల్ డిక్రీ 55/90 ద్వారా ప్రకటించబడిన వాణిజ్య చట్టానికి, రాయల్ డిక్రీ 18/2019 ద్వారా ప్రకటించబడిన వాణిజ్య కంపెనీల చట్టానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!







