నిర్మాణ ప్రదేశాలలో భద్రతా నిబంధనలను పాటించాలి: ఖతార్
- May 18, 2022
ఖతార్: నిర్మాణ ప్రదేశాలలో కార్మికులను రక్షించే ప్రయత్నాలలో భాగంగా కార్మికుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన నిబంధనలను అనుసరించాలని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) పిలుపునిచ్చారు. యజమానులు వాతావరణ, గాలి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వాటికి తగినట్టుగా భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందరు యజమానులు పని ప్రదేశాలలో భద్రతా విధానాలను అనుసరించాలని, గాలి వేగాన్ని కొలవడానికి కచ్చితమైన పరికరాలను ఉపయోగించాలని సూచించింది. గాలి వేగం అనుమతించదగిన పరిమితిని మించి ఉన్నప్పుడు క్రేన్ ఆపరేషన్ను నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. భద్రతా విధానాల అమలును నిర్ధారించుకోవడానికి మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు పని ప్రదేశాలను సందర్శిస్తారని పేర్కొంది. మరోవైపు వాతావరణంలో దుమ్ము ధూళి క్రమంగా తగ్గుతుందని, తాజా వాయువ్య గాలి ఈ వారాంతం వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గాలులు వాయువ్య దిశలో 13, 23 నాట్ల మధ్య వేగంతో వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కొన్నిసార్లు 31 నాట్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







