ఐఐటీ చదువు మరింత భారం ...
- April 07, 2016
ఐఐటీ చదువు మరింత భారం కానుంది. ప్రస్తుతం ఏడాదికి రూ. 90 వేలు మాత్రమే ఉన్న ఫీజును రూ. 2 లక్షలకు పెంచుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ ఫీజును రూ. 3 లక్షలు చేయాలని ఐఐటీ బాంబే డైరెక్టర్ దేవాంగ్ ఖాకర్ నేతృత్వంలోని సబ్ కమిటీ ప్రతిపాదించింది. అయితే ఒకేసారి దాదాపు మూడు రెట్లకు పైగా ఫీజు పెంచితే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి దీన్ని రూ. 2 లక్షలకు పెంచారు. రాబోయే విద్యాసంవత్సరం నుంచే ఈ ఫీజుల పెంపు అమలవుతుంది. మినహాయింపులు ఇలా..ఎస్సీ, ఎస్టీ, వికలాంగులతో పాటు, వార్షికాదాయం లక్ష రూపాయల లోపు ఉన్న కుటుంబాల వారికి ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నారు. వార్షికాదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న కుటుంబాల వారికి మూడింట రెండు వంతుల ఫీజును మాఫీ చేస్తారు. అంటే, వాళ్లు ఏడాదికి దాదాపు రూ. 66వేల ఫీజు కడితే సరిపోతుంది.ఒక్కో విద్యార్థికి వ్యయం రూ. 3.5 లక్షలుప్రస్తుతం ఐఐటీలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మీద ఏటా సగటున రూ. 3.5లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.విద్యార్థి చెల్లిస్తున్న రూ. 90 వేల కంటే ఇది రూ. 2.6 లక్షలు అధికం. రెండు లక్షల వంతున ఫీజు పెంచినా మరో రూ. 1.5 లక్షల వంతున ప్రభుత్వం మీద భారం పడుతుంది. గత కొన్నేళ్లుగా ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ ద్వారా కంపెనీలు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఫీజులు పెంచవచ్చంటూ కేంద్రం నియమించిన కమిటీ పచ్చజెండా ఊపింది.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







