ఐఐటీ చదువు మరింత భారం ...
- April 07, 2016
ఐఐటీ చదువు మరింత భారం కానుంది. ప్రస్తుతం ఏడాదికి రూ. 90 వేలు మాత్రమే ఉన్న ఫీజును రూ. 2 లక్షలకు పెంచుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ ఫీజును రూ. 3 లక్షలు చేయాలని ఐఐటీ బాంబే డైరెక్టర్ దేవాంగ్ ఖాకర్ నేతృత్వంలోని సబ్ కమిటీ ప్రతిపాదించింది. అయితే ఒకేసారి దాదాపు మూడు రెట్లకు పైగా ఫీజు పెంచితే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి దీన్ని రూ. 2 లక్షలకు పెంచారు. రాబోయే విద్యాసంవత్సరం నుంచే ఈ ఫీజుల పెంపు అమలవుతుంది. మినహాయింపులు ఇలా..ఎస్సీ, ఎస్టీ, వికలాంగులతో పాటు, వార్షికాదాయం లక్ష రూపాయల లోపు ఉన్న కుటుంబాల వారికి ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నారు. వార్షికాదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న కుటుంబాల వారికి మూడింట రెండు వంతుల ఫీజును మాఫీ చేస్తారు. అంటే, వాళ్లు ఏడాదికి దాదాపు రూ. 66వేల ఫీజు కడితే సరిపోతుంది.ఒక్కో విద్యార్థికి వ్యయం రూ. 3.5 లక్షలుప్రస్తుతం ఐఐటీలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మీద ఏటా సగటున రూ. 3.5లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.విద్యార్థి చెల్లిస్తున్న రూ. 90 వేల కంటే ఇది రూ. 2.6 లక్షలు అధికం. రెండు లక్షల వంతున ఫీజు పెంచినా మరో రూ. 1.5 లక్షల వంతున ప్రభుత్వం మీద భారం పడుతుంది. గత కొన్నేళ్లుగా ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ ద్వారా కంపెనీలు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఫీజులు పెంచవచ్చంటూ కేంద్రం నియమించిన కమిటీ పచ్చజెండా ఊపింది.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









