సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుంది : జెలెన్ స్కీ
- May 21, 2022
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడుతున్నప్పటికీ ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. రష్యా బలగాలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తోంది. మరోవైపు రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమవుతున్నాయి. యుద్ధం ప్రారంభమయి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఎవరూ ఎవరిపై పైచేయి సాధించలేక పోయారు. యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ… ఈ యుద్ధంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు. సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుందని అన్నారు. యుద్ధంలో రక్తపాతం తప్పదని అన్నారు. యుద్ధం కొనసాగుతుందని… చివరకు దౌత్య మార్గాల ద్వారానే యుద్ధం అంతమవుతుందని చెప్పారు. అయితే రెండు దేశాలు పట్టు వీడకపోవడం వల్ల.. ఇది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని అన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







