సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుంది : జెలెన్ స్కీ
- May 21, 2022
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడుతున్నప్పటికీ ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. రష్యా బలగాలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తోంది. మరోవైపు రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమవుతున్నాయి. యుద్ధం ప్రారంభమయి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఎవరూ ఎవరిపై పైచేయి సాధించలేక పోయారు. యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ… ఈ యుద్ధంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు. సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుందని అన్నారు. యుద్ధంలో రక్తపాతం తప్పదని అన్నారు. యుద్ధం కొనసాగుతుందని… చివరకు దౌత్య మార్గాల ద్వారానే యుద్ధం అంతమవుతుందని చెప్పారు. అయితే రెండు దేశాలు పట్టు వీడకపోవడం వల్ల.. ఇది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని అన్నారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









