ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో 12 మంది ఉగ్రవాదులు హతo

- April 07, 2016 , by Maagulf
ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో 12 మంది ఉగ్రవాదులు హతo

ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో పాక్‌ భద్రతాసిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కుర్రమ్‌ జిల్లాలోని మంగారో అవుట్‌పోస్టు వద్ద ఈ కాల్పులు జరిగాయి.ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి 50 మందికి పైగా తిరుగుబాటు దారులు పాక్‌ సెక్యూరిటీ పోస్టుపై దాడి చేశారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. మిగతా వారు ఆఫ్ఘనిస్థాన్‌ పారిపోయినట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్‌, పాక్‌ దేశాల మధ్య 2,250 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఇరుదేశాల్లోని ఉగ్రవాదులు తరచూ సరిహద్దులపై దాడులకు పాల్పడుతుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com