ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో 12 మంది ఉగ్రవాదులు హతo
- April 07, 2016
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాక్ భద్రతాసిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కుర్రమ్ జిల్లాలోని మంగారో అవుట్పోస్టు వద్ద ఈ కాల్పులు జరిగాయి.ఆఫ్ఘనిస్థాన్ నుంచి 50 మందికి పైగా తిరుగుబాటు దారులు పాక్ సెక్యూరిటీ పోస్టుపై దాడి చేశారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. మిగతా వారు ఆఫ్ఘనిస్థాన్ పారిపోయినట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్, పాక్ దేశాల మధ్య 2,250 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఇరుదేశాల్లోని ఉగ్రవాదులు తరచూ సరిహద్దులపై దాడులకు పాల్పడుతుంటారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







