ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో 12 మంది ఉగ్రవాదులు హతo
- April 07, 2016
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాక్ భద్రతాసిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కుర్రమ్ జిల్లాలోని మంగారో అవుట్పోస్టు వద్ద ఈ కాల్పులు జరిగాయి.ఆఫ్ఘనిస్థాన్ నుంచి 50 మందికి పైగా తిరుగుబాటు దారులు పాక్ సెక్యూరిటీ పోస్టుపై దాడి చేశారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. మిగతా వారు ఆఫ్ఘనిస్థాన్ పారిపోయినట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్, పాక్ దేశాల మధ్య 2,250 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఇరుదేశాల్లోని ఉగ్రవాదులు తరచూ సరిహద్దులపై దాడులకు పాల్పడుతుంటారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









