సూర్య ప్రతాప్ తో శర్వానంద్..
- April 07, 2016
రన్ రాజా రన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన శర్వానంద్, వరుసగా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతోనూ అదే జోరు కొనసాగించాడు. ఎక్స్ ప్రెస్ రాజా సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో, ప్రస్తుతం తన తదుపరి సినిమా మీద దృష్టిపెట్టాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న శర్వా, నెక్ట్స్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా యువనటుడు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన బోల్డ్ ఎంటర్ టైనర్ కుమారి 21ఎఫ్. కథా కథనాలు సుకుమార్ అందించినా.. తనదైన టేకింగ్ తో సినిమాను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన దర్శకుడు పలనాటి సూర్యప్రతాప్ కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన నెక్ట్స్ సినిమాను సూర్య ప్రతాప్ తో చేయాలనుకుంటున్నాడు శర్వానంద్. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









