బ్రిటిష్ ఎయిర్వేస్లో తెలుగు మాట్లాడే క్యాబిన్ క్రూ..
- May 22, 2022
లండన్: బ్రిటిష్ ఎయిర్వేస్ శనివారం కీలక ప్రకటన చేసింది. తమ సంస్థ హైదరాబాద్-లండన్ సర్వీస్ కోసం 20 మంది తెలుగు మాట్లాడే క్యాబిన్-క్రూ సిబ్బందిగా రిక్రూట్ చేసినట్లు తెలిపింది. ఇటీవలి కాలంలో విదేశీ విమానయాన సంస్థలు స్థానిక భాషలకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రిటిష్ ఎయిర్వేస్ తెలుగు మాట్లాడే క్యాబిన్ క్రూ సిబ్బంది నియమించింది. వీరికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినట్టుగా పేర్కొంది. భారతదేశంలోని స్థానిక క్యాబిన్ సిబ్బందిని ఉపయోగించి హైదరాబాద్ నుంచి లండన్కు తమ తొలి విమానాన్ని నడిపినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్తగా రిక్రూట్ చేయబడిన 20 మంది క్యాబిన్ క్రూ సిబ్బందికి లండన్ ఆరువారాల పాటు విస్తృతమైన భద్రత, సేవా శిక్షణను ఇచ్చినట్టుగా బ్రిటిష్ ఎయిర్వేస్ తెలిపింది. హైదరాబాద్-లండన్ మార్గంలో ప్రయాణించే ప్రతి విమానంలో తెలుగు మాట్లాడే సిబ్బంది ఉంటారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనుంచి హైదరాబాద్ నుంచి లండన్కు రాకపోకలు సాగించే బీఏ 276, బీఏ 277 విమానాలలో ప్రయాణికులు ఇక నుంచి మాతృభాషలో పలకరింపులను ఆస్వాదించవచ్చు.
బ్రిటీష్ ఎయిర్వేస్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కాలమ్ లామింగ్ మాట్లాడుతూ..హైదరాబాద్కు స్థానికంగా క్యాబిన్ సిబ్బందిని నియమించుకోవడం అంటే.. ప్రయాణికులకు బ్రిటిష్ శైలి సేవలను తెలుగు భాష, సంస్కృతి, ఆచారాలతో అందించడమేనని చెప్పారు. ఇక, బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రస్తుతం ఐదు భారతీయ నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి లండన్లోని హీత్రూ విమానాశ్రయానికి వారానికి 28 విమాన సర్వీసులను నడుపుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!







