జూన్ నుండి బహిరంగ ప్రదేశాల్లో పని బంద్: కార్మిక మంత్రిత్వ శాఖ
- May 23, 2022
మస్కట్: జూన్ నుండి ఆగస్టు వరకు మధ్యాహ్న సమయాలలో నిర్మాణ స్థలాలు, బహిరంగ ప్రదేశాలలో పని చేయడాన్ని నిషేధించే నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కార్మిక మంత్రిత్వ శాఖలో కార్మిక శాఖ అండర్ సెక్రటరీ షేక్ నస్ర్ బిన్ అమెర్ అల్ హోస్నీ మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరంలో వేసవి కాల ప్రచారాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు నిషేధిత గంటలలో పనిని నిలిపివేసే ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ కొనసాగిస్తుందని తెలిపారు. జూన్, జూలై, ఆగస్ట్లలో బహిరంగ ప్రదేశాలలో కార్మికులు ఎండ దెబ్బకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. మానవ అభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం ఒమన్ సుల్తానేట్లో కార్మికుల భద్రత, వృత్తిపరమైన ఆరోగ్యంపై కార్మిక మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







