జూన్ నుండి బహిరంగ ప్రదేశాల్లో పని బంద్: కార్మిక మంత్రిత్వ శాఖ
- May 23, 2022
మస్కట్: జూన్ నుండి ఆగస్టు వరకు మధ్యాహ్న సమయాలలో నిర్మాణ స్థలాలు, బహిరంగ ప్రదేశాలలో పని చేయడాన్ని నిషేధించే నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కార్మిక మంత్రిత్వ శాఖలో కార్మిక శాఖ అండర్ సెక్రటరీ షేక్ నస్ర్ బిన్ అమెర్ అల్ హోస్నీ మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరంలో వేసవి కాల ప్రచారాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు నిషేధిత గంటలలో పనిని నిలిపివేసే ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ కొనసాగిస్తుందని తెలిపారు. జూన్, జూలై, ఆగస్ట్లలో బహిరంగ ప్రదేశాలలో కార్మికులు ఎండ దెబ్బకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. మానవ అభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం ఒమన్ సుల్తానేట్లో కార్మికుల భద్రత, వృత్తిపరమైన ఆరోగ్యంపై కార్మిక మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!









