ఖతార్లో మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు: మంత్రిత్వ శాఖ
- May 23, 2022
దోహా: ఖతార్ లో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసు నమోదు కాలేదని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH) తెలిపింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ఏవైనా అనుమానిత కేసులు కనిపిస్తే వాటిని ముందస్తుగా గుర్తించేందుకు పూర్తి స్థాయి ప్రజారోగ్య చర్యలను తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య అధికారులకు నివేదించాలని ప్రజలకు సూచించింది. అలాగే మంకీపాక్స్ లక్షణాలతో వచ్చే వారికి సేవలు అందించాలని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మే 13 నుండి ఇప్పటి వరకు కనీసం 12 దేశాల్లో మంకీపాక్స్ కేసులను గుర్తించారు. అయితే ఆ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందలేదు. మంకీపాక్స్ అనేది పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే వైరల్ ఇన్ఫెక్షన్. అప్పుడప్పుడు ఇది ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా జ్వరం, కండరాల నొప్పులు, కణుపుల వాపు(వాటర్ బబుల్స్) లక్షణాలను కలిగి ఉంటుంది. చికెన్పాక్స్ లాంటి దద్దుర్లు చేతులు, ముఖంపై కనిపిస్తాయని నిపుణులు చెబతున్నారు.
తాజా వార్తలు
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్







