రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా 45 మంది మృతి..
- April 07, 2016
రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా ఇప్పటివరకు 45 మంది మృతిచెందినట్లు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వీస్తున్న వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వడగాల్పుల బారిన పడిన వారికి తక్షణం వైద్యం అందించేందుకు ఆయా ఆస్పత్రుల సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. వడదెబ్బ మృతుల కుటుంబాలను తమ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.జిల్లాల వారీగా మృతుల సంఖ్య * కడప - 16 * ప్రకాశం - 11 * అనంతపుంర - 4 * విజయనగరం - 3 * చిత్తూరు - 3 * కర్నూలు - 3 * శ్రీకాకుళం - 2 * కృష్ణా - 2 * పశ్చిమగోదావరి -1
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







