రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా 45 మంది మృతి..
- April 07, 2016
రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా ఇప్పటివరకు 45 మంది మృతిచెందినట్లు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వీస్తున్న వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వడగాల్పుల బారిన పడిన వారికి తక్షణం వైద్యం అందించేందుకు ఆయా ఆస్పత్రుల సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. వడదెబ్బ మృతుల కుటుంబాలను తమ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.జిల్లాల వారీగా మృతుల సంఖ్య * కడప - 16 * ప్రకాశం - 11 * అనంతపుంర - 4 * విజయనగరం - 3 * చిత్తూరు - 3 * కర్నూలు - 3 * శ్రీకాకుళం - 2 * కృష్ణా - 2 * పశ్చిమగోదావరి -1
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









