కువైట్ విమానాశ్రయంలో సాధారణ స్థితికి చేరుకున్న విమానాల రాకపోకలు
- May 24, 2022
కువైట్: దుమ్ము తుఫాను కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు గంటల పాటు నిలిచిపోయిన విమానాల రాకపోకలు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:50 గంటలకు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. ఈ సమయంలో విమానాశ్రయానికి వచ్చే, బయలుదేరే విమానాలు రీషెడ్యూల్ చేయబడ్డాయని DGCA ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ అఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇమాద్ అల్-జులువి పేర్కొన్నారు. దుమ్ము తుఫానుతో దేశంలోని వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీని కారణంగా కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత 500 మీటర్ల కంటే తక్కువకు చేరింది. దానితో పాటు గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో కూడిన చురుకైన గాలులు వీచాయి.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









