ఫిఫా 2022కు సిద్ధమైన ఖతార్ విమానాశ్రయాలు
- May 28, 2022
దోహా: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఫిఫా వరల్డ్ కప్ కోసం దేశంలోని రెండు విమానాశ్రయాలు దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు సిద్ధమయ్యాయి. వివిధ దేశాల నుంచి ప్రేక్షకులు, ఫుట్బాల్ అభిమానులు వచ్చేఅవకాశం ఉన్నందునా ఎయిర్ పోర్టులు గరిష్ట సామర్థ్యంతో పనిచేయనున్నాయి. ప్రతిరోజూ 16,000 మంది ప్రయాణికులు వచ్చివెళ్లేందుకు తగిన ఏర్పాట్లను చేసినట్లు ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బేకర్ తెలిపారు. దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 - 6,000 మంది ఫుట్బాల్ అభిమానులను ప్రాసెస్ చేస్తుందని, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రతి రోజు 8,000 - 10,000 మంది ప్రయాణికులు వచ్చి వెళ్లేలా పనిచేస్తాయని తెలిపారు. నిన్న ఖతార్ ఎయిర్వేస్, నాలుగు గల్ఫ్ ఎయిర్లైన్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. దీనిలో భాగంగా ఫ్లైదుబాయ్ రోజుకు 2,700 మంది అభిమానులను, కువైట్ ఎయిర్వేస్ 1,700 మందిని, ఒమన్ ఎయిర్ 3,400 అభిమానులను, సౌదియా(Saudia) 10,000 మంది అభిమానులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









