పబ్లిక్ యుటిలిటీల ధ్వంసం.. SR100,000 జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష
- May 28, 2022
రియాద్: పబ్లిక్ యుటిలిటీస్ ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయని, వాటిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసే వ్యక్తులకు భారీ జరిమానాలు విధిస్తామని సౌదీ అరేబియా ప్రాసిక్యూషన్ అధికారులు హెచ్చరించారు. ఏదైనా పబ్లిక్ యుటిలిటీ వ్యవస్థలకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన పక్షంలో నేరస్తుడితోపాటు అతనికి సహకరించిన వారికి కూడా శిక్షలు విధించబడుతుందన్నారు. నేర తీవ్రతను బట్టి గరిష్టంగా SR100,000 జరిమానా, రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది. అలాగే పబ్లిక్ యుటిలిటీకి జరిగిన నష్టం లేదా ఇతరులకు జరిగిన అన్ని నష్టాలను తిరిగి చెల్లించడంతో పాటు,నిబంధనలు ఉల్లంఘించినవారి వల్ల కలిగే నష్టాన్ని సరిదిద్దడానికి అయ్యే ఖర్చులను పరిహారం కింది నిందితులు చెల్లించాల్సి ఉంటుందని ప్రాసిక్యూషన్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







