పబ్లిక్ యుటిలిటీల ధ్వంసం.. SR100,000 జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష
- May 28, 2022
రియాద్: పబ్లిక్ యుటిలిటీస్ ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయని, వాటిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసే వ్యక్తులకు భారీ జరిమానాలు విధిస్తామని సౌదీ అరేబియా ప్రాసిక్యూషన్ అధికారులు హెచ్చరించారు. ఏదైనా పబ్లిక్ యుటిలిటీ వ్యవస్థలకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన పక్షంలో నేరస్తుడితోపాటు అతనికి సహకరించిన వారికి కూడా శిక్షలు విధించబడుతుందన్నారు. నేర తీవ్రతను బట్టి గరిష్టంగా SR100,000 జరిమానా, రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది. అలాగే పబ్లిక్ యుటిలిటీకి జరిగిన నష్టం లేదా ఇతరులకు జరిగిన అన్ని నష్టాలను తిరిగి చెల్లించడంతో పాటు,నిబంధనలు ఉల్లంఘించినవారి వల్ల కలిగే నష్టాన్ని సరిదిద్దడానికి అయ్యే ఖర్చులను పరిహారం కింది నిందితులు చెల్లించాల్సి ఉంటుందని ప్రాసిక్యూషన్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







