ఆన్లైన్ వీసా విధానాల్లో ఎలాంటి మార్పు లేదు:సౌదీ
- May 29, 2022
రియాద్: యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫారమ్ కింద విదేశీ కార్మికుల నియామక ప్రక్రియ, ప్రవాసుల వీసా ప్రక్రియకు సంబంధించి ప్రస్తుత ఎలక్ట్రానిక్ సిస్టమ్లు, విధానాలలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ మేరకు మే 17న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫారమ్ హోస్టింగ్ ఏడాదిలోగా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసి)కి బదిలీ చేయబడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA) ఆధ్వర్యంలోని ఆన్లైన్ వీసా ప్లాట్ఫారమ్ను ఎన్ఐసిగా మార్చాలని క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేయడానికి క్యాబినెట్ మొత్తం 11 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలను నియమించింది. ఏకీకృత ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేయడానికి, విధివిధానాలను ఖరారు బాధ్యతను వీటికి అప్పగించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









