ఆన్లైన్ వీసా విధానాల్లో ఎలాంటి మార్పు లేదు:సౌదీ
- May 29, 2022
రియాద్: యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫారమ్ కింద విదేశీ కార్మికుల నియామక ప్రక్రియ, ప్రవాసుల వీసా ప్రక్రియకు సంబంధించి ప్రస్తుత ఎలక్ట్రానిక్ సిస్టమ్లు, విధానాలలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ మేరకు మే 17న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫారమ్ హోస్టింగ్ ఏడాదిలోగా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసి)కి బదిలీ చేయబడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA) ఆధ్వర్యంలోని ఆన్లైన్ వీసా ప్లాట్ఫారమ్ను ఎన్ఐసిగా మార్చాలని క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేయడానికి క్యాబినెట్ మొత్తం 11 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలను నియమించింది. ఏకీకృత ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేయడానికి, విధివిధానాలను ఖరారు బాధ్యతను వీటికి అప్పగించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







