ఆన్లైన్ వీసా విధానాల్లో ఎలాంటి మార్పు లేదు:సౌదీ
- May 29, 2022
రియాద్: యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫారమ్ కింద విదేశీ కార్మికుల నియామక ప్రక్రియ, ప్రవాసుల వీసా ప్రక్రియకు సంబంధించి ప్రస్తుత ఎలక్ట్రానిక్ సిస్టమ్లు, విధానాలలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ మేరకు మే 17న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫారమ్ హోస్టింగ్ ఏడాదిలోగా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసి)కి బదిలీ చేయబడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA) ఆధ్వర్యంలోని ఆన్లైన్ వీసా ప్లాట్ఫారమ్ను ఎన్ఐసిగా మార్చాలని క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేయడానికి క్యాబినెట్ మొత్తం 11 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలను నియమించింది. ఏకీకృత ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేయడానికి, విధివిధానాలను ఖరారు బాధ్యతను వీటికి అప్పగించింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







