కువైట్ లోని ప్రవాసులకు ముఖ్య గమనిక..

- May 31, 2022 , by Maagulf
కువైట్ లోని ప్రవాసులకు ముఖ్య గమనిక..

కువైట్ సిటీ: కువైట్ లోని భారత ఎంబసీ బుధవారం(జూన్ 1వ తారీఖు) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.భారత రాయబారి సిబి జార్జ్‌ ఈ కార్యక్రమం ద్వారా కువైత్‌లోని భారత ప్రవాసుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చిస్తారు. ఆలివ్ సూపర్ మార్కెట్ భవనం, జ్లీబ్ అల్ షుయూక్ (అబ్బాసియా)లోని బీఎల్‌ఎస్ ఔట్‌సోర్సింగ్ సెంటర్‌లో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.కువైట్ లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి ఆహ్వానితులే.అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి.ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం లేదని ఎంబసీ వెల్లడించింది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా ఫహహీల్‌లోని బీఎల్‌ఎస్ ఔట్‌సోర్సింగ్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నం., సివిల్ ఐడీ నం.,కాంటాక్ట్ నం,కువైట్ లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన [email protected] కు ఈ-మెయిల్ చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com