ముంబైలో మళ్లీ కరోనా విజృంభణ
- June 01, 2022
ముంబై: ముంబైలో గతంలో కరోనా ఎంతగా విజృంభించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ముంబైలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచింది.ముంబైలో పాజిటివిటీ రేటు 6 శాతానికి చేరిందని బృహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) బుధవారం తెలిపింది. 12-18 ఏళ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని బీఎంసీ కోరింది.
అలాగే, అర్హులైన అందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని చెప్పింది. కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందని, కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు తగినంతమంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండచుకోవడంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని బీఎంసీ కోరింది. కాగా, ముంబైలో మంగళవారం 506 కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 6న 536 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కరోనా కేసులు మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ముంబైలో ఏప్రిల్లో నమోదైన కేసుల కంటే మేలో 100 శాతం కేసులు అధికంగా నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







