భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు

- June 04, 2022 , by Maagulf
భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు

కువైట్: కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆపరేషన్స్ డిపార్టుమెంట్ ఎలాంటి నష్టానికి సంబంధించిన ఫిర్యాదులూ అందుకోలేదని తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున స్వల్ప భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దేశంలోని సదరన్ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో తమ విభాగానికి ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత 4.4గా వుందనీ, ఈ కారణంగా ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు వివరించారు. భూకంప తీవ్రత 6 ఆ పైన వుంటేనే నష్టం వాటిల్లుతుందని మిటియరాలజిస్ట్ అదెల్ అల్ సాదౌన్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com