జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసు : ఐదుగురు నిందితులు అరెస్ట్
- June 05, 2022
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పబ్ కు వచ్చిన 17 ఏళ్ల మైనర్ బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కార్ ఎక్కించుకొని , గ్యాంగ్ రేప్ చేయడం సంచలనంగా మారింది. ఈ దారుణానికి పాల్పడిన వారంతా రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన వారే కావడం తో ఈ కేసు ఫై అంత ఫోకస్ చేసారు. ప్రభుత్వం నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు ఆరోపణలు చేయడం, పోలీసులు చూపని ఆధారాలు వారు బయటపెట్టడం తో మరింత ఇంట్రస్ట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన కు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసారు. శనివారం ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.మరో మైనర్తో పాటు ఉమేర్ఖాన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. కాగా, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు.
నిందితులు ఎవరనేది చూస్తే..
A1.. సాదుద్దీన్(ఎంఐఎం నేత కొడుకు)
A2.. ఉమేర్ఖాన్(ఎమ్మెల్యే సోదరుడి కొడుకు)
మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు
మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు
మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారు.
ఇక ఈ కేసు ఫై గవర్నర్ తమిళ సై..స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









