భారత్ కరోనా అప్డేట్
- June 06, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 4,518 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,81,335కు చేరింది. దేశంలో హోం క్వారంటైన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 25,782కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉన్నాయి.
కరోనా రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉంది. అలాగే, వారంతపు పాజిటివిటీ రేటు 0.91 శాతంగా ఉంది. కరోనాతో మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,701కు చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,26,30,852 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 194.12 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
కాగా, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ప్రజలందరూ మాస్కును తప్పనిసరిగా వాడాలని సూచించాయి. దేశంలోని పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతుండడం కలవరపెడుతోంది.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







