నిర్మాణ కార్మికులకు 3 నెలలపాటు మధ్యాహ్న విరామం
- June 09, 2022
యూఏఈ: జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ప్రాజెక్ట్, నిర్మాణ ప్రదేశాలలో కార్మికులకు మధ్యాహ్న విరామ నిబంధనను ప్రారంభిస్తున్నట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ఈ విరామ నిబంధన ప్రకారం.. ఎండలు తీవ్రంగా ఉండే మధ్యాహ్నం 12:30-3 గంటల వరకు కార్మికులను పనిచేసేందుకు అనుమతించరు. దీంతో కార్మికులు వేసవి నెలల్లో అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల కలిగే ప్రమాదాల నుండి వారిని రక్షించబడతారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. MoHREలో ఇన్స్పెక్షన్ అఫైర్స్ కు తాత్కాలిక అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అయిన మొహ్సేన్ అల్ నాస్సీ మాట్లాడుతూ.. గత 18 ఏండ్లుగా ఈ నియమాన్ని అమలు చేస్తున్నామని, దీంతో కార్మికులు హీట్ స్ట్రోక్కు గురయ్యే కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. మధ్యాహ్న విరామాన్ని ఉల్లంఘించే సంస్థలపై ఒక్కో కార్మికునికి Dh5,000 అడ్మినిస్ట్రేటివ్ జరిమానా(గరిష్టంగా Dh50,000) విధించబడుతుందని హెచ్చరించారు. నిబంధనలు పాటించని సంస్థలపై మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ కి 600590000 ద్వారా సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు అనేక భాషల్లో తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చన్నారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







