పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ..
- June 11, 2022
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ వ్యవస్థకు తలమానికంగా నిలిచేలా ప్రభుత్వం నిర్మిస్తున్న పోలీస్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఈ భవనానికి సంబంధించి.. దాచి ఉంచిన 38 కాపర్ బండిల్స్ను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది. నిర్మాణ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ చోరీకి సంబంధించి నిర్మాణ సంస్థ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
అలాగే మెయిన్ కమాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ చోరీ ఇంటి దొంగల పనే అయ్యుంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనుమానిత వ్యక్తిని గుర్తించి, ప్రశ్నిస్తున్నారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. జంటనగరాల్లో పూర్తి నిఘా పెట్టేలా, ఎక్కడ.. ఎలాంటి ఘటన జరిగినా వెంటనే స్పందించేలా, సరికొత్త టెక్నాలజీతో ఈ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







