పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ భవనంలో చోరీ..

- June 11, 2022 , by Maagulf
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ భవనంలో చోరీ..

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ వ్యవస్థకు తలమానికంగా నిలిచేలా ప్రభుత్వం నిర్మిస్తున్న పోలీస్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఈ భవనానికి సంబంధించి.. దాచి ఉంచిన 38 కాపర్ బండిల్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది. నిర్మాణ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ చోరీకి సంబంధించి నిర్మాణ సంస్థ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

అలాగే మెయిన్ కమాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ చోరీ ఇంటి దొంగల పనే అయ్యుంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనుమానిత వ్యక్తిని గుర్తించి, ప్రశ్నిస్తున్నారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. జంటనగరాల్లో పూర్తి నిఘా పెట్టేలా, ఎక్కడ.. ఎలాంటి ఘటన జరిగినా వెంటనే స్పందించేలా, సరికొత్త టెక్నాలజీతో ఈ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com