పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ..
- June 11, 2022
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ వ్యవస్థకు తలమానికంగా నిలిచేలా ప్రభుత్వం నిర్మిస్తున్న పోలీస్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఈ భవనానికి సంబంధించి.. దాచి ఉంచిన 38 కాపర్ బండిల్స్ను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది. నిర్మాణ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ చోరీకి సంబంధించి నిర్మాణ సంస్థ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
అలాగే మెయిన్ కమాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ చోరీ ఇంటి దొంగల పనే అయ్యుంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనుమానిత వ్యక్తిని గుర్తించి, ప్రశ్నిస్తున్నారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. జంటనగరాల్లో పూర్తి నిఘా పెట్టేలా, ఎక్కడ.. ఎలాంటి ఘటన జరిగినా వెంటనే స్పందించేలా, సరికొత్త టెక్నాలజీతో ఈ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







