ప్రజా రవాణాలో దొంగతనాలు.. ప్రయాణికులకు పలు సూచనలు
- June 13, 2022
యూఏఈ: బస్సుల్లో జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని యూఏఈ పోలీసులు కోరారు. నేరాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రస్ అల్ ఖైమా పోలీస్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా అహ్మద్ బిన్ సల్మాన్ అల్ నుయిమి మాట్లాడుతూ.. దొంగలు సాధారణంగా ప్రజా రవాణాను ఉపయోగించుకుంటారని, పిక్పాకెటర్లు బాధితురాలితో ఇంటరాక్ట్ అవుతారని, దొంగతనం చేసేముందు బాధితులను మాటల్లో పెడతారని ఆయన తెలిపారు. ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నప్పుడు ప్రయాణికులకు ఆయన పలు సూచనలు చేశారు. సులభంగా తెరవగలిగే బ్యాగ్లను.. విలువైన వస్తువులను తమ వెంట తీసుకెళ్లవద్దు. రోజుకి అవసరమైనంత నగదు మాత్రమే తీసుకెళ్లాలి. తమ వాలెట్, నగదు లేదా మొబైల్ ఫోన్ను వెనుక జేబులో పెట్టుకోవద్దు. ఇతర ప్రయాణీకుల నుండి దూరంగా ఉండాలి. అపరిచితులతో మాట్లాడవద్దని ఆయన సూచించారు. ప్రయాణికులందరికీ భద్రత కల్పించేందుకు అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారని సల్మాన్ అల్ నుయిమి తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







