తొలి ప్రైవేటు రైలు ప్రారంభం
- June 15, 2022
కోయంబత్తూరు: భారత్లో తొలి ప్రైవేటు రైలు ప్రారంభమైంది. ‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది. ‘దేఖో అప్నా దేశ్’ పేరుతో బయలుదేరిన ఈ రైలులో దాదాపు 1100 మంది ప్రయాణికులు ఉన్నారు. గురువారం ఉదయం ఏడున్నర గంటల వరకు రైలు సాయినగర్ షిరిడీకి చేరుకుంటుంది. తిరిగి శుక్రవారం ఉదయం బయలుదేరి, శనివారం మధ్యాహ్నం కోయంబత్తూరు చేరుకుంటుంది.
వెళ్లేటప్పుడు మార్గమధ్యలో మంత్రాలయం వద్ద రైలు ఐదు గంటలు ఆగుతుంది. ఈ సమయంలో భక్తులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవచ్చు. ఈ రైలులో ప్రయాణించేందుకు ఐదు రోజుల టూర్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ షిరిడీ వెళ్లి, అక్కడ్నుంచి ఇదే రైలులో తిరిగి రావొచ్చు. రైలును ఆధునికంగా తీర్చిదిద్దారు. రైలులో డాక్టర్, రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు, ఏసీ మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది ఉంటారు. టూర్ ప్యాకేజీ కింద రైలులో శాకాహార భోజనం కూడా అందిస్తారు. భక్తులకు షిరిడీలో వీఐపీ దర్శనం, ఏసీ రూమ్స్, టూరిస్ట్ గైడ్స్, స్థానిక రవాణా వంటివి కూడా ప్యాకేజీలో భాగంగా అందిస్తారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం







