సైబర్ క్రైంకు పాల్పడితే Dhs 500,000 జరిమానా, జైలు శిక్ష
- June 15, 2022
యూఏఈ: అనుమతి లేకుండా ఇతరుల పాస్వర్డ్ లు, పాస్కోడ్లు, రహస్య నంబర్లు లేదా మరే ఇతర వివరాలను పొందడం శిక్షార్హమైన చర్య అని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలను హెచ్చరించింది. నేరానికి పాల్పడే ఉద్దేశ్యంతో వెబ్సైట్, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, డేటా నెట్వర్క్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాధనాలను యాక్సెస్ చేయడం లేదా మరొక వ్యక్తికి యాక్సెస్ పొందడం వంటివి ఇందులో ఉన్నాయని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్లో పోస్ట్ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆరు నెలల వరకు జైలు శిక్షతోపాటు Dhs500,000 వరకు జరిమానా విధించే అవకావశం ఉందని పేర్కొంది. ఎలక్ట్రానిక్ నేరాలు, వదంతుల వ్యాప్తి 2021 ఆర్టికల్ నెం.34 ప్రకారం జైలుశిక్ష, జరిమానా విధించబడుతుందని తన పోస్ట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు