ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డు మదర్ థెరిస్సాకు..
- April 09, 2016
ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డును బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాది మదర్ థెరిస్సాకు ప్రకటించింది. ఇతరులకు మార్గదర్శకమైన విజయాలు సాధించిన ఆసియావాసులకు అందించే ఈ అవార్డును బ్రిటన్ మదర్ థెరిస్సాకు ఆమె మరణానంతరం ప్రకటించింది. ఈ అవార్డును శుక్రవారం థెరిస్సా మేనకోడలు ఆగి బొజాజియు స్వీకరించారు. ఈ అవార్డును స్వీకరించేందుకు 76 ఏండ్ల ఆగి ఇటలీ నుంచి లండన్ వచ్చారని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ ప్రవాస భారతీయుడు, పారిశ్రామికవేత్త ఉత్తమ సమాజ సేవా అవార్డు పొందారు. బ్రిటన్లో నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహానికి ఆయన లక్షపౌండ్లు విరాళంగా అందజేశారు. ఇండోరమ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ ప్రకాశ్ లోహియాకు బిజినెల్ లీడర్ అవార్డు లభించింది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









