ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డు మదర్ థెరిస్సాకు..

- April 09, 2016 , by Maagulf
ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డు మదర్ థెరిస్సాకు..

 ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డును బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాది మదర్ థెరిస్సాకు ప్రకటించింది. ఇతరులకు మార్గదర్శకమైన విజయాలు సాధించిన ఆసియావాసులకు అందించే ఈ అవార్డును బ్రిటన్ మదర్ థెరిస్సాకు ఆమె మరణానంతరం ప్రకటించింది. ఈ అవార్డును శుక్రవారం థెరిస్సా మేనకోడలు ఆగి బొజాజియు స్వీకరించారు. ఈ అవార్డును స్వీకరించేందుకు 76 ఏండ్ల ఆగి ఇటలీ నుంచి లండన్ వచ్చారని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ ప్రవాస భారతీయుడు, పారిశ్రామికవేత్త ఉత్తమ సమాజ సేవా అవార్డు పొందారు. బ్రిటన్‌లో నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహానికి ఆయన లక్షపౌండ్లు విరాళంగా అందజేశారు. ఇండోరమ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ ప్రకాశ్ లోహియాకు బిజినెల్ లీడర్ అవార్డు లభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com