ప్రైవేటు సంస్థ డాటా చోరీ చేసిన స్కామర్స్.!

- June 18, 2022 , by Maagulf
ప్రైవేటు సంస్థ డాటా చోరీ చేసిన స్కామర్స్.!

బహ్రెయిన్: బహ్రెయిన్‌లో ఓ ప్రముఖ ప్రైవేటు కంపెనీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ కేంద్రంలో ఫిర్యాదు చేయడం జరిగింది. విలువైన డేటా, స్కామర్ల ద్వారా దొంగతనానికి గురైనట్లు కంపెనీ తన ఫిర్యాదులో పేర్కొంది. స్కామర్లు, పెద్ద మొత్తంలో సొమ్ముని డిమాండ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమయ్యింది. ఇప్పటికైతే సమాచారం ఏమైనా దుర్వినియోగం అయ్యిందా.? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లేదని సదరు సంస్థ చెబుతోంది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు ముహమ్మద్ షిరాస్ మాట్లాడుతూ, అన్ని కంపెనీలూ స్కామర్ల నుంచి అప్రమత్తంగా వుండాలనీ, రక్షణాత్మక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com