పేకాట ఆడుతూ పట్టుబడిన 18మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు!
- June 20, 2022
కువైట్: పేకాట ఆడుతూ పట్టుబడిన పద్దెనిమిది మంది ప్రవాసులను డిపోర్టేషన్కు పంపారు. మళ్లీ వారు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. రాత్రి వేళల్లో కొంత మంది పేకాట ఆడుతున్నారని, వారి తీరుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు పేకాట ఆడుతున్న అపార్ట్ మెంట్పై దాడి చేసి 18మందిని అరెస్టు చేశారు. గురు, శుక్రవారాల్లో సాయంత్రం అపార్ట్ మెంట్కు వెళ్లిన వారు రాత్రంతా పేకాట ఆడుతూ మద్యం సేవించేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. జూదగాళ్ల నుంచి 1500కు పైగా దినార్లు, పేకాట ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







