బోటు మునక: ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

- June 22, 2022 , by Maagulf
బోటు మునక: ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

మస్కట్: పది మందితో వెళుతోన్న చక్కబోటు మునిగిపోవడంతో, ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన దోఫార్ గవర్నరేటులోని విలాయత్ ఆఫ్ తాకా తీరంలో జరిగిందని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది. ఈ మేరకు సిడిఎఎ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 10 మంది ఆసియా జాతీయులు బోటులో వెళుతుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. బోటులో కొన్ని వాహనాలు కూడా వున్నట్లు గుర్తించారు. మొత్తం 8 మందిని ఈ బోటు మునక ఘటన నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి వైద్య చికిత్స అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com