బిడ్డను వదిలేసిన మహిళను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు
- June 23, 2022షార్జా: రెండు నెలల శిశువును షార్జా లోని అనాథ ఆశ్రమం(ఛారిటీ సెంటర్) లో వదిలేసిన మహిళను కేవలం 5గంటల్లోనే శిశు సంరక్షణ కేంద్రం సహకారంతో షార్జా నేర పరిశోధన శాఖకు చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు.
సాయంత్రం 5 గంటల సమయంలో రెండు నెలల శిశువును అనాథ ఆశ్రమంలో వదిలి వెళ్లినట్లు గుర్తించిన ఆశ్రమ నిర్వహకులు షార్జా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే నగరంలోని సీసి కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా బిడ్డ తల్లి ఆశ్రమం ప్రధాన కార్యాలయంలో ప్రవేశించి అక్కడ తన బిడ్డను వదిలేసి గుట్టు చప్పుడు కాకుండా అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది.ఈ దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారుల బృందం మరియు శిశు సంరక్షణ కేంద్రం ప్రతినిధులు ఆశ్రమంలో ఉన్న బిడ్డను పరిశీలించి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించడానికి అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.
అలాగే మరోవైపు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితురాలి కోసం అన్వేషణ మొదలు 5గంటల్లోనే ఆమె ఆచూకీ లభ్యమైంది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధం కారణంగా బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె ఆశ్రమంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. అలాగే ఆమె పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రతా అధికారి కల్నల్ ఒమర్ బు అల్ జూద్ తెలిపారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం