పని ప్రమాదాల్లో తగ్గుదల
- June 13, 2015
ఖతార్లో గడచిన కొన్నేళ్ళలో ‘పని ప్రమాదాలు’ తగ్గుముఖం పట్టినట్లు సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. పని చేస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు ప్రమాదాలు నివారించగలుగుతామనీ, ఆ జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన పెంచడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విజయం సాధించిందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ షేక్ మహమ్మద్ బిన్ హమాద్ అలీ తని చెప్పారు. భవన నిర్మాణాల్లోనూ, ఇతర సంస్థల్లోనూ కార్మికుల భద్రతే ధ్యేయంగా పలు నిబంధనల్ని ప్రభుత్వం అమలు చేయడం వల్లే పని ప్రమాదాల్ని నివారించగలిగామని అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా గడచిన కొన్నేళ్ళలో గణనీయంగా తగ్గాయి. లక్షలో 26 మంది 2006లో చనిపోగా, ఇప్పుడు ఆ సంఖ్య 9కి తగ్గడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.
--వి.రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







