తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
- June 30, 2022
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇక ప్రయివేటు విద్యార్థుల విషయానికి వస్తే 819 మంది హాజరు కాగా, 425 మంది పాసయ్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ సారి ఫలితాల్లో బాలికలు హవా కొనసాగింది. బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 87.61 శాతం పాసయ్యారు. ఓవర్ ఆల్ గా 90 శాతం విద్యార్థులు పాసయ్యారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 3007 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించిగా.. 15 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు సాధించాయి. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97.85 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో, రెండో స్థానంలో నిర్మల్ ,రంగారెడ్డి జిల్లా 79.63 శాతం ఫలితాలతో చివరి స్థానంలో ఉందని వెల్లడించారు.
ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. 167 మంది ప్రయివేటు విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







