తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
- June 30, 2022
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇక ప్రయివేటు విద్యార్థుల విషయానికి వస్తే 819 మంది హాజరు కాగా, 425 మంది పాసయ్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ సారి ఫలితాల్లో బాలికలు హవా కొనసాగింది. బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 87.61 శాతం పాసయ్యారు. ఓవర్ ఆల్ గా 90 శాతం విద్యార్థులు పాసయ్యారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 3007 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించిగా.. 15 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు సాధించాయి. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97.85 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో, రెండో స్థానంలో నిర్మల్ ,రంగారెడ్డి జిల్లా 79.63 శాతం ఫలితాలతో చివరి స్థానంలో ఉందని వెల్లడించారు.
ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. 167 మంది ప్రయివేటు విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి