మస్కట్ లో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం
- July 01, 2022
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇంటర్నెట్, మొబైల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్నెట్ సేవల్లో అంతరాయంపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) ఒక ప్రకటన విడుదల చేసింది. సబ్-మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లో ఒకదానిలో వైఫల్యం కారణంగా మసందమ్ గవర్నరేట్లో ఇంటర్నెట్ సేవల్లో పాక్షిక అంతరాయం చోటు చేసుకుందని పేర్కొంది. అలాగే మొబైల్ నెట్ వర్క్ సేవలపైనా ప్రభావం చూపిందని తెలిపింది. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరణకు టెలికమ్యూనికేషన్ కంపెనీలు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్లో సేవలను పునరుద్దరించాయని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







