యూఏఈలో ఇంధన ధరల ఆధారంగా టాక్సీ ఛార్జీలు
- July 01, 2022
షార్జా: జూలై 1 నుంచి ఇంధన ధరల ఆధారంగా టాక్సీ ఛార్జీలు మారనున్నాయి. జూలై 1 నుండి యూఏఈ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించే ఇంధన ధరల ఆధారంగా షార్జాలో టాక్సీ ఛార్జీలు పెరగడం లేదా తగ్గడం జరుగవచ్చు. ఇంధన ధరలను బట్టి ప్రతి నెలా మీటర్ ఫ్లాగ్ డౌన్ రేటును పెంచడం లేదా తగ్గించడం జరుగుతుందని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (SRTA) తెలిపింది. యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రతి నెలాఖరున ఇంధన ధరలను ప్రకటిస్తుంది. గ్లోబల్ చమురు ధరలతో స్థానిక ఇంధన ధరలను సమం చేయాలని దేశం ఆగస్టు 2015లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇది అమల్లో ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా జనవరి 2022 నుండి యూఏఈలో పెట్రోల్ ధరలు 56 శాతానికి పైగా పెరిగాయి.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!







