వేసవిలో ఫుడ్ డెలివరీ.. మోటార్సైకిళ్లకు బదులుగా కార్లు
- July 02, 2022
దోహా: ఖతార్లోని ఫుడ్ డెలివరీ సర్వీస్ కంపెనీలు వేసవి కాలంలో మోటార్సైకిళ్లకు బదులుగా కారు ద్వారా వినియోగదారులకు ఆర్డర్లను డెలివరీ చేయడం ప్రారంభించాయి. దేశంలో వేసవి నెలల్లో డెలివరీ రైడర్లు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కార్లను మాత్రమే ఉపయోగించుకునేలా నిబంధన విధించారు. ఇది జూలై 1 నుండి అమలులోకి వచ్చింది. సెప్టెంబర్ 15, 2022 వరకు అమల్లో ఉంటుంది. ఖతార్లోని అనేక ఫుడ్ డెలివరీ కంపెనీలు సోషల్ మీడియాలో ఈ చర్యను స్వాగతించాయి. జూన్ 1 నుండి సెప్టెంబరు 15 వరకు బహిరంగ ప్రదేశాల్లో చట్టబద్ధమైన పని గంటలను పొడిగించిన 2021 నాటి మినిస్టీరియల్ డిక్రీ నెం. 17కు అనుగుణంగా తాజా చర్యలను తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









